ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మాజీ ఐజీ రామకృష్ణపై వేటుకు రంగం సిద్దం!
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీ రామకృష్ణ హయాంలో అవకతవకలు
- ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా నివేదిక
- డిప్యుటేషన్ పదవీ కాలం ముగియడంతో తిరిగి కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రామకృష్ణ
ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఆ శాఖలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. కేంద్రం నుండి డిప్యుటేషన్పై వచ్చిన రామకృష్ణ పదవీ కాలం ముగియడంతో మళ్లీ వెనక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.