పర్వతారోహణ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన 'ఆడి' ఇటలీ అధినేత
- ఆడి ఇటలీ అధినేత ఫాబ్రిజియో లాంగో కన్నుమూత
- పర్వతారోహణ చేస్తూ పదివేల అడుగుల ఎత్తు నుండి పడి మృతి
- ప్రమాదంపై విచారణ జరుపుతున్న పోలీసులు
ఫాబ్రిజియో లాంగో లోయలో పడిపోవడాన్ని గమనించిన తోటి పర్వతారోహకులు రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 700 అడుగుల లోయలో ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించి వెలికి తీసింది. అనంతరం అతని మృతదేహాన్ని హెలికాఫ్టర్ లో కారిసోలోలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.