CS Shanti Kumari: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్య... సీఎస్ కీలక సమావేశం

CS meeting with HYDRA officers over demolitions
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

తమ భవనాలను కూల్చుతారనే ఆందోళనతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు భేటీ నిర్వహించారు.
Go Back to Shorts
CS Shanti Kumari
Telangana
HYDRA

More Telugu News