కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి కేంద్రమంత్రితో రేవంత్ సమావేశం
- టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని విజ్ఞప్తి
- డీపీఆర్ను ఆమోదించాలని కోరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం... కేంద్రమంత్రికి తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.