పెట్టుబడుల పేరిట షెల్ కంపెనీలు... ఇవిగో ఫొటోలు: కేటీఆర్
- పెట్టుబడుల పేరిట స్కాంగ్రేస్ ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తోందంటూ విమర్శ
- సీఎం సోదరుడు ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ బయో కంపెనీతో మోసం చేస్తున్నారని మండిపాటు
- షెల్ కంపెనీలను వెలుగులోకి తెచ్చావంటూ క్రిశాంక్కు ప్రశంస
తెలంగాణలో పెట్టుబడులు పెడతానన్న స్వచ్ఛ బయోపై క్రిశాంక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంవోయూలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తి హర్ష పసునూరి అని పేర్కొన్నారు. ఇతను అనుముల జగదీశ్వర్ బినామీ అని ఆరోపించారు.
స్వచ్ఛ బయోను పదిహేను రోజుల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.1000 కోట్ల పెట్టుబడుల ప్రకటన మోసమని... ఇదంతా కుటుంబ వ్యాపారమని ఆరోపించారు. హర్ష, జగదీశ్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన చిత్రాలను క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు.