రాష్ట్ర విభజనకు జగన్ కారణం: చింతా మోహన్
- జగన్ కాంగ్రెస్ లో ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్న చింతా మోహన్
- కాంగ్రెస్ ను జగన్ బలహీనపరిచారని విమర్శ
- తిరుమల బ్రేక్ దర్శనం వివరాలను బయట పెట్టాలని డిమాండ్
తాను ఎంపీగా ఉన్న సమయంలో... అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తాను తిరుపతిలో క్రికెట్ స్టేడియం కోసం పునాదిరాయి వేశామని... క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చింతా మోహన్ కోరారు. తిరుపతిలోని 10 ప్రాంతాల్లో పిల్లల కోసం ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జూపార్క్ ను వడమాలపేటకు తరలించి... టీటీడీ ఉద్యోగులకు అక్కడ స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.