పార్టీ మారుతున్నారనే ప్రచారంపై సబితా ఇంద్రారెడ్డి స్పందన ఇదే..!
- సబిత కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం
- అవన్నీ అవాస్తవమేనని కొట్టిపారేసిన మాజీ మంత్రి
- పార్టీ మారాల్సిన అవసరం కానీ, ఆలోచన కానీ తనకు లేవని క్లారిటీ
ఈ ప్రచారంపై తాజాగా సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారని వివరించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తనకు ఎంతమాత్రమూ లేవన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మాజీ మంత్రి సబిత స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు.