ఖైదీతో సన్నిహితంగా మహిళా పోలీసు అధికారి.. బ్రిటన్లో కలకలం!
- లండన్లోని వాండ్స్వర్త్ కారాగారంలో ఘటన
- ఖైదీతో సన్నిహితంగా ఉన్న మహిళా అధికారి వీడియో వైరల్
- ఘటనపై దర్యాప్తు ప్రారంభం, నిందితురాలిపై కేసు నమోదు
వాండ్స్వర్త్ కారాగారంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పలు సమీక్షల్లో తేలింది. 1851లో నిర్మించిన ఈ జైల్లో 63 శాతం మంది ఖైదీలు అదనంగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. సిబ్బంది కొరత, ఖైదీల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ మేరకు మే నెలలోనే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రిసన్స్ చార్లీ టేలర్ జస్టిస్ సెక్రెటరీ అలెక్స్ ఛాక్కు నివేదిక సమర్పించారు. చివరకు ఇది జైళ్ల గవర్నర్ రాజీనామాకు కారణమైంది.