నన్ను కలవడానికి వచ్చే మిత్రులు ఇవి తీసుకు రండి ప్లీజ్: కిషన్ రెడ్డి
- తాజాగా కొలువుదీరిన మోదీ కేబినెట్లో కిషన్ రెడ్డికి చోటు
- దీంతో అభినందనలు తెలుపుతూ పలువురు ఆయనను కలుస్తున్న వైనం
- ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తనను కలవడానికి వచ్చే వారికి మంత్రి ప్రత్యేక అభ్యర్థన
- పూల బొకేలు, శాలువాలు, స్వీట్లకు బదులు విద్యార్థులకు నోట్బుక్లు తీసుకురావాలని విజ్ఞప్తి
"నన్ను కలవడానికి వచ్చే మిత్రులు & శ్రేయోభిలాషులందరికీ నా వినమ్రపూర్వకమైన అభ్యర్థన. దయచేసి పూల బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకురావొద్దు. వాటి బదులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్లు లేదా స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తీసుకురాగలరని మనవి" అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.