పోలింగ్ తర్వాత తొలిసారి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం

Grand welcome for TDP Chief Chandrababu at TDP Office in Mangalagiri
  • ఏపీలో మే 13న జరిగిన పోలింగ్
  • నేడు చంద్రబాబు రాకతో టీడీపీ కార్యాలయంలో కోలాహలం
  • చంద్రబాబుకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు
  • సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే 13న పోలింగ్ జరిగిన తర్వాత తొలిసారిగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 

అధినేత రాకతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. సీఎం, సీఎం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో టీడీపీ ఆఫీసు ప్రాంగణం అంతా కోలాహలం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో, పార్టీ కార్యాలయంలో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.
Go Back to Shorts
Chandrababu
TDP
Mangalagiri
Andhra Pradesh

More Telugu News