ఏడో విడత పోలింగ్కు ముగిసిన ప్రచారం... వారణాసిలో తుది విడతలో పోలింగ్
- చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్
- జూన్ 1వ తేదీన పోలింగ్
- తుది విడతలోనే వారణాసి, మండి, గోరక్పూర్ నియోజకవర్గాలకు పోలింగ్
చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.