ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
- 1999, 2009లో కాంగ్రెస్ తరపున గురజాల ఎమ్మెల్యేగా గెలిచిన జంగా
- 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన వైనం
- జంగాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసిన వైసీపీ
1999, 2009లో పల్నాడు జిల్లా గురజాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గా కూడా పని చేశారు. ఎన్నికల ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడక ముందే ఆయనను విప్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.