గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుషం: నారా లోకేశ్
- నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై దాడి
- ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చేసిందన్న లోకేశ్
- దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్
ఈ ఘటనను టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసీపీ మూకల అమానుష దాడి దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.