Telangana: మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణలో 52 శాతం పోలింగ్ నమోదు

  • అత్యధికంగా ఖమ్మంలో 59.91 శాతం ఓటింగ్ నమోదు
  • హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్ నమోదు
  • సాయంద్రం 5 గంటలకు ముగియనున్న పోలింగ్
52 percent Voter turnout in Hyderabad

తెలంగాణలో 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్‌లో 58.24 శాతం, మహబూబాబాద్‌లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం, హైదరాబాద్‌లో 29.47 శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

  • Loading...

More Telugu News