ఐపీఎల్లో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా ధోనీ.. మరో రికార్డును తన పేరున రాసుకున్న దిగ్గజం
- 2008 నుంచి ఇప్పటి వరకు 259 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోనీ
- 150 విజయాల్లో భాగస్వామ్యం
- కెప్టెన్గా 133 విజయాలు సాధించిన ఎంఎస్డీ
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ ఇప్పటి వరకు 259 మ్యాచ్లు ఆడాడు. చెన్నైకి సారథిగా 5 ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. ప్రస్తుత సీజన్లో ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు. ఇక, ధోనీ తర్వాత అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం అయిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (133), రోహిత్ శర్మ (133), దినేశ్ కార్తీక్ (125), సురేశ్ రైనా (122) ఉన్నారు. ఇక, కెప్టెన్గా ధోనీ 133 విజయాలు సాధిస్తే, రోహిత్ శర్మ 87 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.