Stone Attack On Jagan: ఒకే రాయి మూడు గాయాలు చేసింది... ఇది ఎలా సాధ్యం?: ఆనం వెంకట రమణారెడ్డి

Anam Venkataramana Reddy raises doubts over stone attack on Jagan
  • విజయవాడలో నిన్న సీఎం జగన్ పై రాయితో దాడి
  • సందేహాలు వ్యక్తం చేసిన ఆనం వెంకటరమణారెడ్డి
  • వాలంటీర్లకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లిందని వ్యాఖ్యలు

గత రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి సమీపంలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పలు సందేహాలు లేవనెత్తారు. ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. 

పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ కాలుపై పడి కాలికి సైతం గాయం అయిందట... మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు అని నిలదీశారు. సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజి కట్టి  ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆనం ప్రదర్శించారు. సీఎం జగన్ నిన్నటి ఘటనలో అద్భుతంగా నటించారు అని వ్యంగ్యం ప్రదర్శించారు.

"నిన్న రాత్రి 8.15 గంటలకే వాలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లింది? వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, జగన్ పై హత్యాయత్నం జరిగింది... టీవీలు చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 8.10 గంటలకు ఘటన జరిగితే, 8.13 గంటలకే సోషల్ మీడియా స్క్రోలింగ్ ప్రారంభమైంది" అని ఆనం వివరించారు. 

ఈ ఘటన కూడా ఒక డ్రామా అని, రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని, గాల్లో ఉన్న డ్రోన్లు కిందికి దిగిపోయాయని అన్నారు. పక్కా స్కెచ్ తో జరిగిన ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆనం అనుమానం వ్యక్తం చేశారు. 

భారతీ రెడ్డి డైరెక్షన్ లో ఈ డ్రామా జరిగిందని, సీఎం ర్యాలీలో కరెంట్ ఉండదా, డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఈ డ్రామాకు తెరలేపిందని అన్నారు.

  • Loading...

More Telugu News