రేపు మేనిఫెస్టోను విడుదల చేయనున్న బీజేపీ
- సంకల్ప పత్రం పేరుతో విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు
- మేనిఫెస్టో తయారీకి 15 లక్షలకు పైగా వచ్చిన సూచనలు
- మేనిఫెస్టో కోసం వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇందుకోసం ఇప్పటికే రెండుసార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. సంకల్పపత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 15 లక్షల సూచనలు రాగా, ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది.