వారికి వంట చేయడం మాత్రమే తెలుసు.. బీజేపీ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు
- బీజేపీ దావణగెరె అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు
- ప్రతిపక్ష పార్టీకి ప్రజల ముందు మాట్లాడే ధైర్యం లేదన్న శివశంకరప్ప
- మహిళలు ఏ వృత్తిలో లేరో చెప్పాలన్న గాయత్రి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
92 ఏళ్ల శివశంకరప్ప దావణగెరె సౌత్ నుంచి ఐదుసార్లు గెలిచారు. పార్టీలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యే ఆయనే. రానున్న ఎన్నికల్లో ఆ స్థానంలో ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ కాంగ్రెస్ తరపున పోటీపడుతున్నారు. శివశంకరప్ప వ్యాఖ్యలపై గాయత్రి స్పందించారు. మహిళలు పలు రంగాల్లో సత్తా చాటుతున్నారని, పురుషుల ఆధిపత్యం కలిగిన రంగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
‘‘మహిళలు వంట గదికే పరిమితం కావాలని ఆయన (శివశంకరప్ప) చెబుతున్నారు. మహిళలు ఈ రోజుల్లో ఏ వృత్తిలో లేరో చెప్పండి? మేం ఆకాశంలోనూ సత్తా చాటుతున్నాం. ఆ వృద్ధ నాయకుడికి మహిళలు ఎంతగా పురోగమిస్తున్నారో ఆయనకు తెలియదు. మహిళలు పురుషుల కోసం ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదు’’ అని దుమ్మెత్తి పోశారు. శివశంకరప్ప వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.