సంచలన నిర్ణయం తీసుకున్న హరిరామజోగయ్య... కాపు సంక్షేమ సేన రద్దు
- ఇటీవల పరిణామాలతో మనస్తాపం చెందిన హరిరామజోగయ్య
- పవన్ వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని భావిస్తున్న వైనం
- ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి
- రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతానని స్పష్టీకరణ
జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలకు అంగీకరించడం హరిరామజోగయ్యను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయన లేఖలు కూడా రాశారు. సలహాలు ఇచ్చేవాళ్లు వైసీపీ కోవర్టులు అంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా, ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనని హరిరామజోగయ్య భావిస్తున్నారు.
ఇటీవలే హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరారు. హరిరామజోగయ్య కూడా అదే బాట పడతారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ, తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని నేడు హరిరామజోగయ్య ప్రకటించారు.