Ration card EKYC: రేషన్ కార్డ్ ఈ-కేవైసీ పూర్తిచేశారా..? మరో మూడు రోజులే ఛాన్స్!

Ration card holders urged to complete EKYC process by Feb End
షార్ట్స్‌లో చూడండి
బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెలాఖరుతో గడువు పూర్తికానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీని దగ్గర్లోని రేషన్ దుకాణంలో చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. మరోమారు పొడిగించే అవకాశం లేదని అధికారవర్గాల సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 31 తోనే రేషన్ కార్డు గడువు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ గడువును పొడిగించింది. ఈ నెలాఖరు వరకు ఈ-కేవైసీ పూర్తిచేసుకునేందుకు రేషన్ కార్డు దారులకు అవకాశం కల్పించింది. తాజాగా ఈ గడువు కూడా సమీపిస్తోంది.

అధికారుల లెక్కల ప్రకారం.. తెలంగాణలో 75 శాతం మంది రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ పూర్తిచేశారు. మిగిలిన 25 శాతం కార్డుదారులు వెంటనే ఈ-కేవైసీ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈమేరకు గడువులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ-కేవైసీ చేసుకోవడం ఇలా..
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ దగ్గర్లోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈ-కేవైసీ పూర్తయినట్లు రసీదు వస్తుంది. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు వద్ద అయినా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లాల్సిన అవసరమూ లేదని, వీలును బట్టి విడివిడిగా వెళ్లి పూర్తిచేయొచ్చని అధికారులు చెప్పారు.
Go Back to Shorts
Ration card EKYC
Deadline
EKYC
Ration card Holders
Telangana
Civil Supplies

More Telugu News