ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధరంగంలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
- 12 మంది అమాయకులను ఉద్యోగాల పేరిట మోసగించారన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- ఉద్యోగాలని చెప్పి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో దింపారని వెల్లడి
- క్షేమంగా భారత్కు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కోరిన హైదరాబాద్ ఎంపీ
- బాధితుల్లో ఇద్దరు తెలంగాణ యువకులు ఉన్నారని వెల్లడి
రష్యాలో బిల్డింగ్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరిని ఏజెంట్లు మోసగించారని, బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని తనకు చెప్పాయని, ఈ మేరకు మంత్రి జైశంకర్తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానని వివరించారు. బాధితుల్లో ఇద్దరు తెలంగాణవారు కాగా మిగతా వ్యక్తులు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.