నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది: ఈటల రాజేందర్
- బీజేపీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఈటల
- రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమని నేతలు భావిస్తున్నారని వ్యాఖ్య
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కాని హామీలుగా మిగిలిపోవచ్చునని జోస్యం
కాంగ్రెస్ పాలనపై కూడా ఈటల స్పందించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై తాను ఇప్పుడే మాట్లాడనన్నారు. కానీ గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవంతో తనకు తెలిసి... ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు... అమలు కానీ హామీలుగానే మిగిలిపోవచ్చునని జోస్యం చెప్పారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో పునాదులు వేసుకున్నామని... ఇకపై తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండా మాత్రమే అన్నారు.