ఖమ్మం లోక్ సభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న మల్లు భట్టి విక్రమార్క భార్య
- మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు
- కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతల ఆసక్తి
- ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్
ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ సీటు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. సికింద్రాబాద్ సీటు కోసం రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి దరఖాస్తు చేసుకున్నారు.