కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బీజేపీ నాయకురాలు డీకే అరుణ
- లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారెంటీల అమలు అంటున్నారని విమర్శ
- బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందన్న డీకే అరుణ
- సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎందుకు ఎన్నికలు జరపడం లేదు? అని ప్రశ్న
సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎందుకు ఎన్నికలు జరపడం లేదు? అని డీకే అరుణ ప్రశ్నించారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయినప్పటికీ వారికి బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.