హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని సూసైడ్
- కాలేజీ భవనం ఐదో అంతస్తు నుంచి దూకిన రేణుశ్రీ అనే విద్యార్థిని
- ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందికి దూకడంతో మృతి
- కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే పటాన్చెరు పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేణుశ్రీ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టినట్టు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా హైదరాబాద్ కూకట్పల్లిలోని శిల్పాబృందావన్ కాలనీ ఎల్లమ్మబండకి చెందిన ఎం.రేణుశ్రీ బీటెక్(సీఎస్సీ) మొదటి సంవత్సరం చదువుతుంది.