సన్ బర్న్ నిర్వాహకుడు సుమంత్పై కేసు నమోదు
- హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ రద్దు
- బుక్ మై షో, నోడల్ అధికారులకు నోటీసులు
- విశాఖ ఈవెంట్కు అమ్ముడవుతున్న టిక్కెట్లు
దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అనుమతులు లేకుండానే టిక్కెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై షో, నోడల్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. కాగా, బుక్ మై షోలో 'సన్ బర్న్ షో హైదరాబాద్' ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టిక్కెట్లు మాత్రం అమ్ముడవుతున్నాయి.
సన్ బర్న్ భారీ సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలోకి మద్యం అనుమతి ఉంటుంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.