ఓటమితో కుంగిపోవద్దు... ఓడిపోయినవారే అసెంబ్లీ ఇంఛార్జ్లు: కేటీఆర్
- లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్
- అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచన
- జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్న కేటీఆర్
సమావేశం అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... తనను చేవెళ్ల ఎంపీగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశనం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున ఇక బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, దీనిని తిప్పికొట్టాలని సూచించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.