పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్... ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి
- ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టిన I.N.D.I.A. కూటమి
- పార్లమెంట్ భవనంలో దాడిపై కేంద్ర హోంమంత్రి నుంచి సమాధానం లేదని మల్లు భట్టి విమర్శ
- దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారంటూ ఆగ్రహం
దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని.. ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతివారినీ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంటును రక్షించలేని బీజేపీ.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.