ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినా ఏం ఉపయోగం?: టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు
- నాలుగున్నరేళ్లు ప్రజారోగ్యాన్ని జగన్ గాలికి వదిలేశారన్న బాలవీరాంజనేయులు
- నెట్ వర్క్ ఆసుపత్రులకు వెయ్యి కోట్లు బకాయిలు ఉన్నాయని విమర్శ
- ఎన్నికల ముందు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపాటు
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు రూ. వెయ్యి కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని.... ఆ బకాయిలను చెల్లించకుండానే ఎన్నికల ముందు మరో డ్రామాకు జగన్ తెరతీశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యమే అందనప్పుడు... దాని పరిమితిని రూ. 25 లక్షలకు పెంచితే ఏం ఉపయోగం? రూ. కోటికి పెంచితే ఏం ఉపయోగం? అని ఎద్దేవా చేశారు.