లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 358 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.60 శాతం లాభపడ్డ విప్రో షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు, చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 69,654కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 20,938 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (3.60%), ఐటీసీ (2.51%), ఎల్ అండ్ టీ (2.31%), టీసీఎస్ (2.08%), టాటా మోటార్స్ (1.99%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.52%), యాక్సిస్ బ్యాంక్ (-1.05%), అల్ట్రాటక్ సిమెంట్ (-1.04%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.01%), మారుతి (-0.87%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News