మిగ్జామ్ ఎఫెక్ట్: తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- తెలంగాణపైనా మిగ్జామ్ తుపాను ప్రభావం
- భద్రాద్రి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరలింపు
- హైదరాబాదులోనూ ఈ ఉదయం నుంచి వర్షం
ఈ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రెడ్ అలర్ట్ జారీ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలిస్తున్నారు. అటు, హైదరాబాదులోనూ ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది.