మన బౌలర్లు కూడా అదుర్స్... టీమిండియాదే టీ20 సిరీస్

Team India clinches T20 Series against Australia
  • రాయ్ పూర్ లో టీమిండియా జయభేరి
  • 20 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం
  • సిరీస్ 3-1తో టీమిండియా కైవసం
  • డిసెంబరు 3న బెంగళూరులో ఇరు జట్ల మధ్య చివరి టీ20
రాయ్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పోరులో ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. 175 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యారు. ఈ మ్యాచ్ లో నెగ్గిన టీమిండియా... 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో చేజిక్కించుకుంది. 

టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్ చహర్ 2, రవి బిష్ణోయ్ 1, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ చివర్లో పోరాడినా ఫలితం లేకపోయింది. వేడ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31, బెన్ మెక్ డెర్మట్ 19, మాథ్యూ షార్ట్ 22, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. 

సిరీస్ ఫలితం తేలిన నేపథ్యంలో, ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి టీ20 మ్యాచ్ డిసెంబరు 3న బెంగళూరులో జరగనుంది.
Go Back to Shorts
Team India
Australia
T20 Series
Raipur

More Telugu News