పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థినుల ర్యాలీ
- ట్యాంక్ బండ్ సమీపంలో నిరసన కార్యక్రమం
- పాలస్తీనా వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
- డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు
ఈ సందర్భంగా నిరసనకారులు ‘డౌన్ డౌన్ ఇజ్రాయెల్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వ్యాన్లలో తరలించారు. నిరసన కార్యక్రమం నిర్వహణకు అనుమతి లేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత హైదరాబాద్ లో జరిగిన తొలి నిరసన కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. కాగా, పోలీసులు తమను నిర్బంధించడాన్ని హక్కుల కార్యకర్తలు ఖండించారు.