ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. బీ ఫారాల పంపిణీ
- తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా
- ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార బీఆర్ఎస్
- ఈనెల 15న హుస్నాబాద్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం
కాగా, గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్కు ఈశాన్యాన ఉన్న హుస్నాబాద్లో తొలి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న ఆ రెండు చోట్లా నామినేషన్ వేయనున్నారు. అయితే, ఆనవాయతీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.