Jagan: ముగిసిన ఢిల్లీ పర్యటన.. తిరుగుపయనమైన జగన్

AP CM Jagan returned from Delhi
  • గురువారం ఉదయం ఢిల్లీకి బయల్దేరిన సీఎం
  • తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొన్న జగన్
  • నిన్న సాయంత్రం అమిత్ షాతో భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తొలుత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో భేటీ అయ్యారు. నిన్న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. ప్రధాని మోదీని కలుస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు.

More Telugu News

Jagan
YSRCP
Delhi