హరిరామ జోగయ్య పేరిట వీహెచ్ కు కాల్ చేసి డబ్బు అడిగిన సైబర్ నేరగాడు

హరిరామ జోగయ్య పేరిట వీహెచ్ కు కాల్ చేసి డబ్బు అడిగిన సైబర్ నేరగాడు

VH gets fake call in the name of Harirama Jogaiah
  • ఆపదలో ఉన్నానంటూ హరిరామ జోగయ్య పేరిట ఫోన్ కాల్
  • గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని వీహెచ్ కు అభ్యర్థన
  • హరిరామ జోగయ్య నివాసానికి ఓ వ్యక్తిని పంపి వాకబు చేసిన వీహెచ్
  • తనకు వచ్చింది సైబర్ నేరగాడి కాల్ అని నిర్ధారణ... పోలీసులకు ఫిర్యాదు
సైబర్ నేరగాళ్లు రాజకీయ నేతల పేర్లను కూడా వాడుకుంటున్నారు. ఓ సైబర్ నేరగాడు సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య పేరిట తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ కు ఫోన్ చేసి డబ్బు అడిగిన సంఘటన నివ్వెరపరుస్తోంది. ఆ వ్యక్తి తాను హరిరామ జోగయ్యను అంటూ వీహెచ్ కు కాల్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని, వెంటనే గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని కోరాడు. 

అయితే, ఈ ఫోన్ కాల్ పై వీహెచ్ కు అనుమానం వచ్చింది. ఆయన ఓ వ్యక్తిని హరిరామ జోగయ్య నివాసానికి పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. తనకు వచ్చింది సైబర్ మోసగాడి కాల్ అని తెలుసుకుని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సైబరాబాద్ పోలీసులకు కూడా ఈ ఫోన్ కాల్ గురించి సమాచారం అందించారు. 

వీహెచ్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఫోన్ కాల్ ఖమ్మం నుంచి వచ్చినట్టు గుర్తించారు. సైబర్ నేరగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
VH
Harirama Jogaiah
Fake Call
Cyber Crime
Police
Telangana
Andhra Pradesh

More Telugu News