సింగరేణి అవినీతిపై ఈటల సంచలన ఆరోపణలు
- బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రభుత్వానికి సవాల్
- కోయగూడెం బ్లాక్ కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు
- పత్రికల యాజమాన్యాలను కేసీఆర్ కబ్జా చేశారని విమర్శ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ గనులతో తెలంగాణను బొందలగడ్డగా మార్చారని కేసీఆర్ ఆరోపించిన విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మరి తెలంగాణ రాకముందు ఉన్న 12 ఓపెన్ కాస్ట్ గనులు ప్రత్యేక రాష్ట్రంలో 20 గనులకు ఎలా పెరిగాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి పత్రికలు, చానల్స్ యాజమాన్యాలను కేసీఆర్ కబ్జా చేశారని ఈటల ఆరోపించారు.