Team India: మళ్లీ మొదలైన మ్యాచ్... నేపాల్ ను 230 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్

Team India restricts Nepal for 230m runs in rain hit innings
షార్ట్స్‌లో చూడండి
ఆసియా కప్ లో నేడు భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో ఓసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన అనంతరం మ్యాచ్ మళ్లీ మొదలవగా... నేపాల్ ను టీమిండియా 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేసింది. 

నేపాల్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఆసిఫ్ షేక్ 58, కుశాల్ భుర్టెల్ ఆకట్టుకున్నారు. లోయరార్డర్ లో సోంపాల్ కామీ 48 రాణించాడు. గుల్షన్ ఝా 23, దిపేంద్ర సింగ్ ఐరీ 29 పరుగులు  చేశారు. 

టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, రవీంద్ర జడేజా 3, షమీ 1, హార్దిక్ పాండ్యా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో జరుగుతోంది.
Go Back to Shorts
Team India
Nepal
Rain
Asia Cup
Pallekele
Sri Lanka

More Telugu News