బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మా పార్టీలోనే ఉంది: బీజేపీ నేత లక్ష్మణ్

BJP leader Laxman interesting comments on chief minister post
  • సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ తొలి జాబితా ఉంటుందన్న లక్ష్మణ్  
  • వచ్చే ఎన్నికల్లో అవసరమైనచోట సీనియర్లు బరిలో ఉంటారన్న లక్ష్మణ్
  • బీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చలేదన్న బీజేపీ నేత
బీసీలకు బీజేపీలోనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా తమ పార్టీలోనే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన చోట సీనియర్లు కూడా పోటీలో నిలుస్తారని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ తొలి జాబితా విడుదలవుతుందన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.

డబ్బున్నవారికి, అవినీతిపరులకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిందన్నారు. బీజేపీ జాబితా వస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆదరాబాదరాగా అవినీతిపరులైన సిట్టింగ్‌లతో జాబితాను ప్రకటించారన్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చలేదంటే డొల్లతనం బయటపడుతోందన్నారు. తాము మాత్రం షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
Go Back to Shorts
dr k laxman
BJP
BRS
Telangana Assembly Election

More Telugu News