లఢఖ్లో ప్రజల భూమిని చైనా ఆక్రమించింది: రాహుల్ గాంధీ
- ఈ విషయం అక్కడ ఎవరిని అడిగినా చెబుతారన్న కాంగ్రెస్ ఎంపీ
- ప్రధాని మోదీ ఒక్క అంగుళం ఆక్రమణకు గురికాలేదంటున్నారని విమర్శ
- కేంద్ర ఇచ్చిన హోదాతో లఢఖ్ ప్రజలు సంతోషంగా లేరన్న రాహుల్
లడఖ్ ప్రజలు తమకు హోదా ఇచ్చినందుకు సంతోషంగా లేరని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇక్కడి ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. వారికి ఇచ్చిన హోదాతో వారు సంతోషంగా లేరు. వారికి ప్రాతినిధ్యం కావాలి. నిరుద్యోగ సమస్య ఉంది. కేవలం అధికారులతోనే రాష్ట్రాన్ని నడపకూడదని అంటున్నారు. రాష్ట్రం ప్రజల గొంతుకతో నడపాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు.