ఆసియా క్రీడలకు దూరమైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్
- తన మోకాలికి గాయమయిందని వెల్లడించిన ఫొగాట్
- ప్రాక్టీస్ చేస్తుండగా గాయమయిందని వెల్లడి
- ఈ నెల 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానన్న స్టార్ రెజ్లర్
2018లో జకార్తాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించానని, ఈ సారి కూడా గోల్డ్ మెడల్ సాధించాలని కలలు కన్నానని, కానీ గాయం కారణంగా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గాయమైన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశానని, దీంతో తన బదులుగా రిజర్వ్ ఆటగాళ్లను పోటీలకు పంపేందుకు వీలుంటుందని చెప్పారు. మీ అందరి మద్దతుతో 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ కు సిద్ధమవుతానని తెలిపింది.