Chandrayaan-3: 100 కిలోమీటర్ల వరకూ ఓకే.. ఆ తరువాతే..!: 'చంద్రయాన్-3' ల్యాండింగ్ పై ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్య

ISRO chairman talks about most critical phase of chandrayaan 3 which begins beyond 100 km from moons surface
షార్ట్స్‌లో చూడండి
చంద్రయాన్-3 వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ మీడియాకు తెలిపారు. అయితే, వ్యోమనౌక చంద్రుడికి 100 కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నాకే కీలక దశ మొదలవుతుందని చెప్పారు. ఆ తరువాత చంద్రయాన్-3 చంద్రుడికి ఎంత ఎత్తులో ఉందనేది భూమ్మీద నుంచి కచ్చితంగా నిర్ధారించడం అత్యంత కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ దశను ఆర్బిట్ డిటర్మినేషన్ ప్రాసెస్‌ అంటారని వివరించారు. 

‘‘చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నాం. ఆ తరువాత చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలం నుంచి ఎంత దూరంలో ఉందనేది కచ్చితంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా జరిగితే మిగిలిన వ్యవహారమంతా సులువుగా పూర్తవుతుంది. ఈసారి అంతా సక్రమంగా జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పటివరకూ కక్ష్య మార్పులన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయి. ఈ క్రమంలో చంద్రయాన్-2 అనుభవం మాకు బాగా లాభించింది. అప్పట్లో తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై నిశితంగా అధ్యయనం చేశాం. ఈ అనుభవంతో చంద్రయాన్-3లో పలు మార్పులు చేశాం’’ అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు.

జూన్ 14న ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 శ్రీహరి కోట నుంచి నింగిలోకి ఎగసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 170/4313 దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. 'చంద్రయాన్' వ్యోమనౌకను జాబిల్లికి మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఇస్రో ఆగస్టు 9, 17న కక్ష్య కుదింపు చర్యలు చేపట్టనుంది. అంతా సక్రమంగా సాగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.
Go Back to Shorts
Chandrayaan-3
ISRO

More Telugu News