రాయపాటి నివాసం సహా తొమ్మిదిచోట్ల ఈడీ సోదాలు
- ట్రాన్స్స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలోను ఈడీ బృందాల సోదా
- 13 బ్యాంకుల నుండి రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు
- సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు
ఈ కంపెనీ దాదాపు పదమూడు బ్యాంకుల నుండి తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొని, డొల్ల కంపెనీలకు మళ్లించినట్లుగా సీబీఐ ఇదివరకు కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ట్రాన్స్స్ట్రాయ్ కంపెనీ ఖాతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్కు నగదు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సోదాలు జరుగుతున్నాయి.