ముత్యాల జలపాతం అడవుల్లో చిక్కుకున్న 84 మంది టూరిస్ట్లు!
- ఉదయం సందర్శనకు వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుండగా ఉప్పొంగిన వాగు
- దీంతో అడవిలో చిక్కుకుపోయిన పర్యాటకులు
- డయల్ 100 ద్వారా వెలుగు చూసిన సంఘటన
- వారిని తీసుకువచ్చేందుకు అధికారుల ప్రయత్నాలు
మరోవైపు మహబూబాబాద్ నామాలపాడు వద్ద జిన్నెల వాగు పొంగిపొర్లింది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసి, ఆ తర్వాత ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తింది. నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం నీటి మట్టం 44.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.