అలాంటి అధికారులను మహిళలతో తన్నిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్
- మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తనకు ఫిర్యాదులు రాకూడదన్న రెడ్యా నాయక్
- ఫిర్యాదు వస్తే బాధ్యుడైన అధికారిని మహిళలతో తన్నిస్తానని హెచ్చరిక
- పనులు పూర్తి చేయకపోతే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని మండిపాటు
రెడ్యా నాయక్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతూ ఆయన అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.