ఆ పార్టీలు అధ్యక్షుల్ని మార్చినా.. బీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేరు: హరీశ్ రావు
- తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం
- దక్షిణాదిపై బీజేపీది చిన్నచూపు అని ఆరోపణ
- కాంగ్రెస్ కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ హామీని అమలు చేయాలని సూచన
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.4వేల పెన్షన్ హామీని ముందుగా కర్ణాటకలో అమలు చేయాలని సూచించారు. పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఫ్రీడమ్ పార్కులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్పాలిత రాష్ట్రాలలో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా? అని నిలదీశారు. ఆ పార్టీలలో ప్రజలు తిరస్కరించిన లీడర్లు, స్క్రాప్ లీడర్లు చేరితే పోయేదేమీలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు.