ఆక్టోపస్ పహారాలో తిరుమల
- శ్రీవారి ఆలయానికి భద్రత పెంచనున్న ప్రభుత్వం
- త్వరలో ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు
- ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది
కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తయారు చేసిన టీం ఆక్టోపస్.. ఉగ్రదాడులకు సంబంధించిన ఆపరేషన్లలో ఆక్టోపస్ బృందాలు ఆరితేరి ఉంటాయి. టెర్రర్ దాడులకు సంబంధించి ఈ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డే-విజన్ కళ్లద్దాలు, అత్యాధునిక ఆయుధాలతో నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఎలాంటిదాడినైనా మెరుపువేగంతో తిప్పికొట్టడంలో ఆక్టోపస్ టీం సభ్యులు నిష్ణాతులు. అధునాత ఆయుధాలను అలవోకగా వాడగల సత్తా ఆక్టోపస్ టీమ్కు ఉంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆక్టోపస్ బృందాలు సెక్యూరిటీ కల్పిస్తున్నాయి.