గవర్నర్ తమిళిసై వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది: హరీశ్ రావు
- ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని చూస్తే ఆందోళన కలుగుతోందన్న తమిళిసై
- కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న హరీశ్
- బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ మాట్లాడుతున్నారని విమర్శ
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లోనే నిర్ణయం తీసుకున్నారని హరీశ్ చెప్పారు. కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అయితే ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు.