వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
- ఇంట్లో కుప్పకూలిపోయిన పార్థసారథి
- విజయవాడలోని టాప్ స్టార్ ఆసుపత్రికి తరలించిన వైద్యులు
- యాంజియోగ్రామ్ నిర్వహించి, స్టంట్ వేసిన వైద్యులు
విజయవాడ అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించిన వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.