Uttar Pradesh: ఆడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఘటన
  • పామును కొరికి చంపాక స్పృహ కోల్పోయిన బాలుడు
  • సకాలంలో వైద్యం అందించడంతో తప్పిన ముప్పు
3 year old boy chews snake to death in Uttar Pradesh

ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అక్కడ కనిపించిన పామును చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్ మూడేళ్ల కుమారుడు శనివారం ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అతడి వైపుగా వచ్చింది. 

దానిని ఒడుపుగా పట్టుకున్న బాలుడు నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంట చనిపోయిన పామును కూడా పట్టుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

More Telugu News